గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంనంది కొండ మున్సిపాలిటీ,హిల్ కాలనీ యందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ ప్రాంగణం లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా…. స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి గారితో కలిసి ఉత్సవాలలో పాల్గొని, సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి,బోగ్ బాండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ. గిరిజనుల ఆరోగ్య దైవం సంతు సేవాలాల్ మహారాజని, గిరిజనుల ఉద్ధరణ కోసం సంతు సేవలల్ మహారాజ్ చేసిన కృషి ఎనలేనిదని, ఆయన చూపిన బాటలో గిరిజనులంతా ఐక్యతతో నడవాలన్నారు. బంజారా జాతి ఐక్యతకు, అభ్యున్నతికి సంతు సేవలల్ ఎంతో కృషి చేశారని అన్నారు. భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు. సంతు సేవాలాల్ గిరిజన ఆరాధ్య దైవమే కాక గొప్ప ఆదర్శ పురుషుడని అహింసా సిద్ధాంతానికి పునాదివేసి ఆచరించి చూపిన మహనీయుడని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనులకే కాదు అందరి ఆరాధ్య దైవమని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంతసేవలాల్ గూడూలు ఉన్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగవాన్ నాయక్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కార్నటి లింగారెడ్డి,గిరిజన నాయకులు స్కైలాబ్ నాయక్,శంకర్ నాయక్,బాబురావు నాయక్, త్రిపురారం జడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్,త్రిపూరారం యం.పి.పి అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ నాయక్,స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్,స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు,గిరిజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.