బీజేపీ 210 సీట్లు దాటడం గగనమే

బీజేపీ 210 సీట్లు దాటడం గగనమేరాబోయే లోక్‌సభ ఎన్నికలలో మోదీ నిర్దేశించు కున్న 370 సీట్ల లక్ష్యం చేరుకోవడం ఎంత అసాధ్యమో, బీజేపీ 200 సీట్లు దాటడం ఎంత గగనమో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అర్థమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలలో మొత్తం 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్ని కలలో 29 స్థానాలు గెలిచింది. కర్నాటకలోని 28 స్థానాలకుగాను 25 స్థానాలు, తెలంగాణ లో నాలుగు స్థానాలను బీజేపీ గెలిచింది. ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ 10 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉన్నది. తెలం గాణలో గెలిచిన నాలుగు స్థానాలకు అటు ఇటు గా ఉండొచ్చు. తమిళనాడు, కేరళలో సీట్లు పొందే అవకాశం లేదు. తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడీఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరితే, పరిస్థితులు అనుకూలిస్తే రెండో, మూడో సీట్లు రావడానికి అవకాశం ఉన్నది.
దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణాదికి చెందిన 128 స్థానాలు పోగా మిగిలిన 415 స్థానాలలో ఎన్డీఏ కూటమి రమారమి 385 స్థానాలు సాధించాలి లేదా బీజేపీ 355 స్థానాలు సాధించాలి. ఎన్డీఏ మిత్ర పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌), శివసేన (ఏకనాథ్‌షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌), ఎన్డీఏలోని ఇతర చిన్న, చితక పార్టీలకు కేటాయించి సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతం లో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350 కి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. నార్త్‌ ఇండియాలో బీజేపీ పోటీ చేసే అన్ని సీట్లు గెలిస్తే గాని 370 సీట్లు సాధించలేదు. ఇది ప్రజ లతో, ప్రతిపక్షాలతో మైండ్‌గేమ్‌ తప్ప ఇంకొకటి కాదు. దీనిని అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు.
ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉపునిచ్చిన మాట నిజమే. కానీ లోక్‌ సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల నుండి అదనంగా బీజేపీ సాధించేదేమీ లేదు. ఈ మూడు రాష్ట్రాలలో 65 లోక్‌సబభ స్థానాలు ఉండగా, 2019 లోక్‌ సభ ఎన్నికలలో బీజేపీ 61 స్థానాలను, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఒక స్థానంలో గెలుపొందాయి. అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే ఉన్నాయి. రాజస్థాన్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్‌కు ఓట్ల తేడా 2.14 శాతం మాత్రమే. వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఈ రాష్ట్రా లలో బీజేపీకి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు.2019 ఎన్నికలలో గుజరాత్‌, హ ర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని 52 లోక్‌సభ స్థానాలకు గాను 52 స్థానాలను(100శాతం సీట్లు) బీజేపీ గెలుపొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, రైతాంగ ఉద్యమంలో హ ర్యానా రైతులు పెద్దఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో బీజే పీకి కనీసం 15సీట్లు తగ్గే అవకాశం ఉన్నది.
80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో 2019లో 49.98 శాతం ఓట్లతో 62 స్థానాలు బీజేపీ గెలిచింది. 2014 తో పోల్చితే 9 సీట్లు తగ్గాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 41.29 శాతం ఓట్లు మాత్రమే బీజేపీ పొందింది. యూపీలో అయోధ్య తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బీజేపీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే కనీసం 20 సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. హిందీ బెల్ట్‌లో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్‌. 40 లోక్‌సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌)కు 16, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపి)కి 6 స్థానాలు వచ్చాయి. నితీష్‌కుమార్‌ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ప్రభుత్వాలను మార్చడం, బీజేపీ నీతిమాలిన చర్యలు, ప్ర భుత్వ వ్యతిరేకత వెరసి రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జెడి), కాంగ్రెస్‌, వామపక్ష కూటమి సగానిపైగా సీట్లు గెలుచు కునే అవకాశం ఉన్నది. జార్ఖండ్‌ మొత్తం 14 సీట్ల గాను 2019లో బీజేపీ 11, మిత్రపక్షం ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యు) ఒక స్థానంలో గెలి చింది. ఇప్పుడు కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎమ్‌ ఎమ్‌) మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా.
మహారాష్ట్రలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 2019 లో బీజేపీ 23, అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివ సేన 18 స్థానాలను పొందాయి. కాంగ్రెస్‌ ఒకటి, ఎన్సీపి నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. ఇప్పుడు శివసేన (ఏకనాత్‌ షిండే), ఎన్సీపి (అజిత్‌ పవార్‌) ఎన్డీఏ తో ఉన్నారు. శివసేన (ఉద్దవ్‌ థాక్రే), ఎన్సిపి (శరద్‌ పవార్‌) ఇండియా కూటమితో ఉన్నారు.ఇండియా కూటమి పక్షాలు ఐదు సీట్ల కంటే పెరిగే పరిస్థితి ఉంది తప్ప తగ్గేదైతే లేదు.
పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా మొత్తం 63 సీట్లలో 2019లో బీజేపీ పొందిన సీట్లు 26, కాంగ్రెస్‌ 3, బెంగా ల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 22, ఒరిస్సాలో బిజు జనతాదళ్‌ 12 స్థానాలలో గెలుపొందాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఒరిస్సాలో బీజేడీ ప్రత్యర్తి పార్టీలు. బీజేపీ గతం కంటే ఈ రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం లేదు. పంజాబ్‌ 13, జమ్మూ కాశ్మీర్‌ 6, గోవా 2, మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్‌ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలిదళ్‌ 2, యుపిఏ పక్షం జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 3, ఆప్‌ ఒక సీటు గెలుపొందాయి. ఇప్పుడు బిజెపి తిరిగి 6 సీట్లు పొందడం గగనమే.
సెవెన్‌ సిస్టర్స్‌గా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం 14 లోక్‌సభ స్థానాలు కలిగి ఉండగా, మిగతా ఆరు రాష్ట్రాల్లో పది లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. సహౌదర రాష్ట్రం సిక్కిం ఒక లోకసభ స్థానం మొత్తం 25 స్థానాలకు గాను 2019లో లోక్‌సభ జనరల్‌ ఎన్నికలలో బీజేపీ 15, ఎన్డీఏ పక్షాలు మరో ఐదు గెలి చాయి. అదనంగా ఇక్కడ బీజేపీకి ఎన్డిఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు. మిగతా 6 కేంద్ర పాలిత రాష్ట్రాలైన లక్ష ద్వీప్‌, చండీగర్‌, పాండిచ్చేరి, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయి లోగల ఆరు లోక్సభ స్థానాలు గాను 2019లో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌ కు రెండు, ఇతరులకు రెండు వచ్చాయి. వీటితో ఎన్డీఏకు పెరిగేది లేదు. ఇండియాకు తగ్గేది లేదు.
మోడీ నాయకత్వంలోని బీజేపీ, ఎన్డీఏ సర్కార్‌ తమ ఎన్నికల వాగ్దానాలు అనేకం విస్మరించింది. అభివఅద్ధి సూచి నేలచూపులు చూస్తుంటే ధరల సూచి ఆకాశం వైపు పరిగెడుతున్నది. ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నది. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నది. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అటు ఉంచితే కరోనా కేసులు(4 కోట్ల 50 లక్షలు), ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య (5 లక్షల 33 వేలు)లో దేశాన్ని రెండో స్థానంలో నిలిపారు. 2014 ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయ లేదు. నిరుద్యోగం 10.32 శాతానికి పెరిగింది. తాను అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలోనే ఒక కోటి పది లక్షల కోట్ల అప్పులు చేసి, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులపై విమర్శలు చేయడం మోడీకే చెల్లుతుంది. మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నది. ”కనీస మద్దతు ధర”కు చట్టబద్ధత కోసం పోరాడుతున్న రైతాంగంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఒక రైతును కాల్చిచంపింది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మోదీ మోసపూరిత మాటలనే నమ్ముకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జబ్బలు జారేయ కుండా వామపక్ష, లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో కలసి పో రాటం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించగలదు.