
నిండు జీవితానికి రెండు చుక్కలు అని చండూర్ మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ కోడి వెంకన్న అన్నారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వవార్డు లోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్స్ పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతొందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం అందుబాటులో లేనివారు సోమవారం,మంగళ వారాల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్స్,మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.