రేపు మల్హర్ లో మంత్రి దుద్దిళ్ల పర్యటన

– పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
– కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో నేడు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం భూమిపూజలు నిర్వహించునట్లుగా మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య  పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. మల్లారం పరిదిలో కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో రూ.3కోట్లతో నిర్మాణం చేపట్టిన అదనపు గదులు,ఆరోగ్య ఉపకేంద్రము రూ.15 లక్షలు, తాడిచెర్లలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి గది రూ.15 లక్షలు,ఆరోగ్య ఉప కేంద్రము, లైబ్రరీ రూ.25 లక్షలు, రైతులు పొలాల వద్దకు వెళ్ళేందుకు మోటు ఒర్రె మరమ్మతులు రూ.40 లక్షలు,రూ. 65 లక్షలతో నిర్మాణం పూర్తియిన తహశీల్దార్ కార్యాలయం, కాపురం ఆర్అండ్ఆర్ సైట్ లో రూ.3కోట్లతో విద్యుత్ మరమ్మతులు తదితర రూ.10 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం చేయునట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు.నాయకులు కేశారపు చెంద్రయ్య, బొబ్బిలి రాజు గౌడ్,మహేష్,సతీష్ పాల్గొన్నారు.