సీఎంకు కృతజ్ఞతలు :బి వేణుగోపాల్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టీశాట్‌ చైర్మెన్‌గా నియమితులైన బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఆ పదవిలో నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ రెడ్డిని సీఎం అభినందించారు.