వెంటనే ఎస్ బీఐ బీజేపీ యొక్క అక్రమ విరాళాల వివరాలు చెప్పాలి

– ఎస్ బీఐ ను డిమాండ్ చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని పార్టీల యొక్క ఎలక్ట్రికల్ బాండ్ పథకం యొక్క వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పినప్పటికీ బీజేపీ యొక్క అక్రమ లావాదేవీలను బయట పెట్టనందుకు నిరసనగా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్బిఐ బ్రాంచ్ ముందు నిరసన గురువారం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2017 నుండి రాజకీయ పార్టీలు తీసుకున్న ఎలక్ట్రికల్ బాండ్ (విరాళాలు) యొక్క వివరాలను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ కు 6 మార్చి 2024వ తేదీ వరకు అప్పగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు తెలియజేసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజెపి యొక్క విరాళాల వివరాలను ఇంకా అందించలేదని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగంలో అధునాతన సాంకేతికత ద్వారా కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు బయటికి వచ్చే టెక్నాలజీ ఉన్న కూడా కేవలం బిజెపితో తమకు ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజెపి యొక్క విరాళాల వివరాలను బహిర్గతం చేయలేక పోతుందని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారులకు తొత్తుగా మారి వారి నుండి కోట్ల రూపాయల నల్లధనం విరాళాల పేరుతో తమ ఖాతాలో జమ చేసుకుందని మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ విరాళాల వివరాలను బయట పెడితే బిజెపి యొక్క అసలు బండారం బయటపడుతుందని భయంతో మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒత్తిడి తెచ్చి వారి వివరాలు బయటకు రాకుండా చూస్తున్నాడని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలియజేశారు. వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 నుండి బిజెపి యొక్క ఎలక్ట్రికల్ బాండ్ (అక్రమ విరాళాల) యొక్క వివరాలను బహిర్గతం చేయాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎలక్ట్రికల్ బాండ్ పేరుతో కార్పొరేట్ కంపెనీల నుండి అక్రమ సంపాదనను విరాళంగా తీసుకుందని, ఎస్బిఐ బిజెపి కలిసి చీకటి ఒప్పందం నడుపుతున్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. బిజెపి మరియు ఎస్బిఐ యొక్క చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి జాతీయ కాంగ్రెస్ ఆదేశాల మేరకు జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్బిఐ బ్రాంచ్ ముందు ధర్నా చేయడం జరిగిందని, ఈ ధర్నా కేవలం బిజెపి యొక్క అక్రమ ఆర్థిక లావాదేవీలు బహిర్గతం చేయడానికి అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బిజెపి చీకటి ఒప్పందం కుదుర్చుకొని బిజెపి తమ సంపదను అక్రమంగా పెంచుకుందని దానికి సంబంధించిన వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,పిసిసి మాజీ కార్యదర్శి రాంభూపాల్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా sc సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా obc అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్,వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి,మక్లోర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి,చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్,
విజయ్ పాల్,వినయ్,పంచరెడ్డి చరన్,మోస్ర నర్సారెడ్డి,నందిపెట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్,రుద్రుర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్,స్వామి గౌడ్,కైసర్,వినోద్,వరుణ్, నరేందర్ గౌడ్,రాజ గగన్,మహేందర్,మధు సుదన్,సంజయ్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.