నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ సొసైటీ ఛైర్మన్ మారుతి పటేల్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని 9 మంది పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. గురువారం సాయంత్రం సొసైటీ పాలకవర్గ సభ్యులు జిల్లా అధికారులను కలసి వినతిపత్రం అందజేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు. మిర్జాపూర్ సహకార సంఘం లో 13 మంది ఉండగా ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మారుతి పటేల్ చైర్మన్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 10 మంది సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ చేరి సంఘం అధ్యక్షుడు పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించారు. గతంలో 13 మంది సొసైటీ సభ్యులు బీఆర్ ఎస్ పార్టీ మద్దతు తో గెలవగా ఒకరు రాజీనామా చెయ్యగా. 12 మంది సభ్యుల్లో ప్రస్తుతం ఇందులో 9 మంది బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఏనుగు రవీందర్ రెడ్డి సమిక్షంలో చేరి ఇదే రోజు సొసైటీ డైరెక్టర్లు ప్రత్యేక సమావేశమై అవిశ్వాస నోటీసు అందజేసినట్లు సమాచారం. 9 మంది సభ్యుల్లో రాంబాబు, నారాయణ చైర్మన్ పోటీలో ఉన్నట్లు సమాచారం. పలు డైరెక్టర్లతో క్యాంప్ లో ఉన్నట్లు సమాచారం. దీనితో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీ ఆర్ ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్న మీర్జాపూర్ గ్రామంలో పలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.