కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే..?!

నేటికాలంలో చాలామంది మొబైల్‌ ఫోన్లకు అలవాటుపడిపోయారు. రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్ల స్క్రీన్లు చూస్తుంటే వారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో చిన్నవయసులోనే కండ్ల జోడ్లు వాడక తప్పని పరిస్థితి. మరి కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సిట్రస్‌ పండ్లు: ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. సీజన్లలో దొరికే బత్తాయి, నారింజ పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటిచూపును మెరుగుపరు స్తాయని వైద్యులు చెబుతున్నారు.
క్యారెట్‌ : ప్రతిరోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది. చేపలలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ఆకుకూరలు : రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరల్లోనూ బచ్చలికూర ఎక్కువగా తీసుకుంటే మంచిది.