నవతెలంగాణ – భీంగల్
గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో భీంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం కొనసాగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తుమ్మ సుప్రీకా 1000/ 955 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. శ్రీపాద వైష్ణవి 1000/935 మార్కుల సాధించి బైపీసీ విభాగంలో టాపర్ గా నిలువగా, జుహానాజ్ 1000/911 సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ అబ్బా చిరంజీవి, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు