చామల గెలుపు కోసం చండూరులో ఇంటింటి ప్రచారం..

– బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలను నమ్మొద్దు..
– ఎమ్మెల్యేకు తోడుగా ఎంపీని గెలిపించుకుంటే నియోజవర్గాన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చు..
– కాంగ్రెస్  జిల్లా నాయకులు కలిమికుండా జనార్ధన్, భూతరాజు వేణు 
నవతెలంగాణ – చండూరు  
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ జిల్లా  నాయకులు కలిమి కొండా జనార్దన్, భూతరాజు వేణు  మున్సిపల్ పట్టణంలోని  212 బూత్  లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిన మోసాలపై ప్రజలకు అవగాహన   కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు . లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేకు తోడుగా ఎంపీ ని గెలిపించుకుంటే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చని అన్నారు . బిజెపి బీఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో భూతరాజు సూర్యం , రావిరాల వెంకన్న , సంగెపు శ్రీనివాస్ , పాలకూరి కిరణ్ , గజం ఉమేష్ , పులిపాటి గోపయ్య , చెన్నగాని శ్రీకాంత్ , గురుజ రమేష్ , పద్మ పవన్ కుమార్ , పాల్గొన్నారు.