కాంగ్రెస్ గెలుపుతో అన్ని వర్గాలు అభివృద్ధి

– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్
– జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిది  జంపయ్య నాయక్
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్రంలో కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది, సంక్షేమ పథకాలు అందుతాయని, అలాగే ఉపాధిహామీ కూలీలకు 200 పని దినాలు పెంపుతోపాటు, రూ.400 వేతనాలు అందుతాయని భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిది జంపయ్య నాయక్ ఓటర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓటు వేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో  రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు శనివారం మండలంలోని రుద్రారం గ్రామంలో మొoడికుంట, కొనుగోలు కేంద్రాల్లో  నిర్వహించారు.పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని గెలిపిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మేనిపేస్టో లో పెట్టిన ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో భోగే మల్లయ్య, లింగయ్య, చంద్రగిరి సంపత్, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్, ఇప్ప మొoడయ్య, చిగురు సదయ్య, చెంద్రయ్య, మహేష్, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి చంద్రగిరి అశోక్, గట్టయ్య ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.