ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ పట్టణ సమీపంలోని అని శెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్  కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దాసరి చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. అంతేకాక  ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు నుండి కేంద్ర ఏన్నికల సంఘం పరి శీలకులు, రిటర్నింగ్ అధికారితో పాటు, సహాయ రిటర్నింగ్ అధికారులు అందరూ అక్కడే బస చేసేందుకు వసతి చూడాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్  వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, డిఆర్డిఏ పిడి  నాగిరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవికుమార్,పంచాయతీ రాజ్ ఈ ఈ భూమన్న, తదితరులు ఉన్నారు.