

గత పాలకులు నాగరాన్ని పట్టించు కోలేదు.పేద ప్రజలు నివాసం ఉండే నాగారాన్ని విస్మరించారు. 2014 ముందు నాగారం లో సరియైన రోడ్లు లేవు-డ్రైనేజీలు లేవు,స్ట్రీట్ లైట్లు లేవు.ఇప్పుడు నాగారం కి 5 నిముషాల్లో అంబులెన్స్ వచ్చేలా రోడ్లు వేసాము. బాబాన్ సాబ్ పహాడి వద్ద కొత్త వంతెన నిర్మిస్తున్నాము.2 కోట్లా రూ.లు నాగారాం అభివృద్ధి కి నిధులు మంజూరు చేసాము. కంటేశ్వర్,వినాయక్ నగర్ ఎలా ఉందో అలాగే నాగారాన్ని అభివృద్ధి చేసే భాధ్యత తీసుకుంటాను.సంక్షేమం విషయానికి వస్తే నిజామాబాద్ నగరం లో 40000 మంది కి ఆసరా పింఛన్లు ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్క విద్యార్థికి 1 లక్ష 20 వేయిల రూ.ఖర్చు చేస్తూ ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాము.అడా బిడ్డలకు గౌరవం పెంచి కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బి అర్ ఎస్. అభివృద్ధి-సంక్షేమం లో ముందుకెళ్తున్న బి ఆర్ ఎస్ పార్టీ నుండి మరోసారి నాకు అవకాశం ఇవ్వండి నాగారాన్ని ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,దండు శేఖర్,కార్పొరేటర్ బొడిగం కోమల్ నరేష్ , సిర్ప రాజు,బాబ్ల్యూ ఖాన్,సాయి వర్ధన్,చంద్రకళ,ముక్తర్,పవార్ పండరీ,సుధాకర్ మరియు కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.