ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను ఆదరించండి: చింత క్రాంతి

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ – నల్గొండ – ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక  తీన్మార్ మల్లన్న నీ ఆదరించి గెలిపించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి పిలుపునిచ్చారు.  ఆదివారం మండలంలోని పస్రా గ్రామం నందు గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య యూత్ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి హాజరై మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని గెలిపించాలని చదువుకున్న యువతను కోరారు.  గత పదేండ్ల పాలనలో దొరల అహంకారం, అక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిందని, యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే, బి.ఆర్.ఎస్.పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టి, విద్య, ఉద్యోగాలు లేకుండా యువతను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఐదు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో ఎంపిక చేసింది, మెగా డిఎస్సీ వేసింది, ములుగులో వైద్య కళాశాల ప్రారంభం చేసి, వైద్య కళాశాల యందు అలాగే ఆరోగ్య శాఖా యందు కూడా ఉద్యోగ భర్తీ చేపట్టిందని అన్నారు. తీన్మార్ మల్లన్న  కూడా ప్రశ్నించే గొంతుక అని, గత ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అని, ప్రజల కష్టాలను, నష్టాలను అంచనా వేసిన వ్యక్తి కనుక ప్రతి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోరం రామ్మోహన్, గొంది కిరణ్, చెరుకుల సురేష్ తదితర యూత్ నాయకులు పాల్గొన్నారు.