నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఈనెల 24వ తేదీన కమ్మర్ పల్లి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మండల స్థాయి అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలను మండల పరిషత్ కార్యాలయంలో 30 జిరాక్స్ కాపీలతో 21వ తేదీ నాటికి అందజేయాలని సూచించారు.