పిడిపి, సి స్పేస్ ఉమ్మడి బ్యానర్లులో నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో నిర్మితమవుతున్న చిత్రం ‘యేవమ్’ . ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్తో చాందినీ చౌదరి క్యారెక్టర్ పోస్టర్ను, అలాగే హాట్లుక్లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ను, పోలీస్ ఆఫీసర్గా యాక్టర్ భరత్తో ‘ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్స్ అన్నింటికీ విశేష స్పందన లభించింది, ఇప్పుడు అదే తరహాలో మరో వైవిధ్యమైన క్యారెక్టర్ పోస్టర్ను రిలీజ్ చేసారు. కన్నడ స్టార్ వశిష్ఠ ఎన్ సింహను ‘యుగంధర్’ లుక్లో ”ఏం? నేను సరిపోనా?’ అనే హుక్ లైన్తో మరో పోస్టర్ను లాంచ్ చేశారు. యుగంధర్ తెలుగులో ఇప్పటి వరుకు చేసిన అన్ని క్యారెక్టర్లతో పోలిస్తే ఈ లుక్ చాలా యూనీక్గా ఉంది అని ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఒక పక్క హీరోగా చేస్తూ కూడా మరో పక్క నవదీప్ ఇలా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం, ఈ కథకి ఉన్న పోటేన్షియాలిటీని చెప్పకనే చెబుతోందని చిత్రయూనిట్ పేర్కొంది. చాందిని చౌదరి, వశిష్ట సింహ, జై భరత్ రాజ్, ఆశు రెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పలత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవదీప్, పవన్ గోపరాజు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రకాష్ దంతులూరి, సినిమాటోగ్రాఫర్: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీత దర్శకులు: కీర్తన శేష్, నీలేష్ మందలపు, ఎడిటర్: సుజనా అడుసుమిల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రాజు పెనుమత్స.