– సీఎం కేసీఆర్ దార్శనికతకు 24 గంటల నిరంతర విద్యుత్ నిదర్శనం: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రగతి సభలో మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
విద్యుత్ వినియోగంలో తెలంగాణ.. భారతదేశంలోనే మొదటిస్థానంలోనే నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చూసినట్టు రాష్ట్రంలో 69.40 శాతం విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్రంగంలో అద్భుతాలు సృష్టించారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని వట్టి ఖమ్మం పహాడ్ 400/220/132 సబ్ స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ విజయాలపై నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభను టీఎస్ఎస్పీడీసీఎల్డీఈ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సబ్స్టేషన్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించి జ్యోతిప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటుతో చీకట్లు మాయమయ్యాయన్నారు. ఉద్యమ సమయంలో నిండు సభలో.. రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ తెలంగాణ ప్రజల్లో గుబులు పుట్టించిన నాటి పాలకులే.. చీకట్లోకి పోయారన్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండేదని, ఇప్పుడు ఆ ఉత్పత్తి 18,567 మేగావాట్లకు చేరుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు.ఇందులో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొదలు యాజమాన్యాల వరకు అందరి శ్రమ ఉందని ప్రశంసించారు. యావత్ భారతదేశం నుంచి తెలంగాణకు విద్యుత్ ట్రాన్స్మిషన్కు తగిన వెసులుబాటు ఉందని తెలిపారు. 2014కు పూర్వం ఎందుకు 24 గంటల ఇవ్వలేక పోయారని, అది ఇప్పుడు ఎలా సాధ్యమైందన్న విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014కు ముందు విద్యుత్ సంక్షోభంతో ఎండిపోయిన పంటపొలాలను చూసి తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, క్రాప్ హాలిడేస్తో పారిశ్రామిక వేత్తలు రోడెక్కి ఆందోళనలతో అట్టుడికి పోయారని, ఇప్పుడు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ తొమ్మిందేండ్లలో సాధించిన అభివృద్ధి ఏంటో అని విమర్శలు చేసే వారికి విద్యుత్రంగంలో సాధించిన విజయాలు చెంపపెట్టు లాంటిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జెడ్పీ వైస్చైర్మెన్ వెంకట్నారాయణగౌడ్, ఎంపీపీలు ధరావత్కుమారి, బాబునాయక్, రవీందర్రెడ్డి, వైస్ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, ఎస్పీడీసీఎల్సీఈ పాల్రాజు, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మీ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జూలకంటి సుధాకర్రెడ్డి, సర్పంచ్ కలకొండ కరుణ, తదితరులు పాల్గొన్నారు.