దేశవ్యాప్తంగా లోక్సభతోపాటు ఏపీ అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో ఈసారీ సినీ ప్రముఖులు విజయం సాధించారు. అయితే రాష్ట్రాలు, స్థానాల వారీగా వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్.. నుంచి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ హ్యాట్రిక్ సాధించారు. ఇప్పటికే రెండు సార్లు గెలుపొందిన ఆయన మూడోసారి 31,602 ఓట్ల మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విక్టరీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్పై 71 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
కేరళలో.. త్రిస్సూర్ స్థానం నుంచి మలయాళ నటుడు సురేశ్ గోపీ 75,079 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హేమమాలిని 2,41,500 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)లో కొనసాగుతూ.. విక్టరీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్ సభ నియోజవర్గం నుంచి పాపులర్ నటుడు రవికిషన్ 74,536 ఓట్ల ఆధిక్యంతో (బీజేపీ) గెలుపుబాట పట్టారు.