పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలి

నవతెలంగాణ- చిట్యాల టౌన్
చిట్యాల మండలం వెలిమీనేడు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు గత సంవత్సరములో ఎన్నికలు నిర్వహించకుండా రైతుల తోటి మీటింగ్ ఏర్పాటు చేసి డైరెక్టర్లను ఎన్నుకున్నారు. పాల ఉత్పత్తి దారులు మేనేజర్ కు మాత్రం ఎన్నికల నిర్వహించినట్టు తీర్మానం ఇవ్వడం జరిగింది .ఈసారి ఈ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కానీ ఎన్నికలు నిర్వహించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మీటింగ్ ద్వారా కొత్త డైరెక్టర్లను ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనది కాదు కావున పాల ఉత్పత్తిదారుల యొక్క అభిప్రాయం మేరకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నాం లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం అని సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పంది నరేష్ హెచ్చరించారు.