నవతెలంగాణ – శంకరపట్నం
మాదక ద్రవ్యాల నిరోధక సైనికుల ఫోరం (అంటి డ్రగ్ సాలిడర్స్ ఫోరం) ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్.ఆదివారం తెలిపారు.శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
మండలం లో గ్రామ గ్రామాన మాదక ద్రవ్యాల వలన యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, చదువులు మానివేసి జీవితాలను మదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారుల, సహకారంతో యువజన సంఘాలను, మహిళా సంఘాల ప్రజా ప్రతినిధులతో,కుల సంఘాలతో కలిసి గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొంగోని అభిలాష్, ఎంఆర్ పీఎస్ మండల అధ్యక్షులు కనుకుంట్ల శ్రీనివాస్, టీడీపీ నాయకులు అరిఫ్, నాయకులు చల్లూరి రాజేందర్, కోడూరి మహేష్, సామల హరీష్, తదితరులు పాల్గొన్నారు.