పెన్షన్లు పెంచాలని కలెక్టరేట్ ముందు ధర్నా..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది రూ.300, మూడువందలతో వికలాంగులు ఏ విధంగా బ్రతుకుతారు. రూ.300 పింక్షన్ రూ.3000 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురుపంగా ప్రకాష్ , వనం ఉపేందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మాట్లాడారు.  అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతాము.  వృద్ధులకు వితంతువులకు రూ.4000 వికలాంగులకు రూ.6000 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నది పింక్షన్ పెంపు కోసం 44,49,767 మంది లబ్ది దారులు ఎదురు చూస్తున్నారు. క్రొత్తగా పింక్షాన్ దరఖాస్తు చేసుకున్న 24,84000 లక్షల మందికి ఇప్పటివరకు మంజురు కాలేదు. 2014 రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింక్షన్స్ మంజూరుకు ముందు ఆదాయ పరిమితి విధిస్తూ జివో 17 ను విడుదల చేసింది. దీనిని వెంటనే రద్దు చేయాలని, 2015 కంటే ముందు సదరన్ సర్టిఫికెట్ పొందిన వారికీ ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం లేదు, 2015 కంటే ఉన్న  సదరన్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆమె ప్రకారం వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి నెల 5 వ తేదీ లోపు పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ కోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఏఓ నాగేశ్వరరావు కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బోల్లపల్లి స్వామి, జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత, బోనగిరి డివిజన్ కార్యదర్శి గడ్డం యాదగిరి, సంజీవ, శంకర్, మామిడి బగంత రెడ్డి, బర్ల పార్వతి, డి వెంకటేశం, కే అంజశ్రీ, పి గోపి, మాటూరు ఐలయ్య , నాగు నరసింహ లు పాల్గొన్నారు.