బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి: ఎస్పీ..

నవతెలంగాణ – నల్గొండ కలెక్టర్
బాధితులకు సత్వర న్యాయ జరిగేలా చూడాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా నలుమూలల నుండి బాధితులు ఎస్పీకి వినతులను అందజేశారు. ఈ సందర్భంగా  దాదాపు 40 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి  సమస్యలను తెలుసుకొని  పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో  భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన పిర్యాదులు ఉన్నాయి.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన  ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాధితుల  ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.