
నవతెలంగాణ-గోవిందరావుపేట
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని పసర ఎస్ ఐ ఏ కమలాకర్ అన్నారు. గురువారం తన సిబ్బందితో కలిసి పసర పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకుల కుంట గుత్తి కోయే గూడెంను ఎస్ఐ కమలాకర్ సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుడదని, కొత్త వ్యక్తులు తమ గ్రామంకు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు. చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతే కాకుండా అక్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షకాలం దృశ్య వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించటం కల్పించారు అంతేకాకుండా వారి ఆరోగ్యం గురించి ఇతరత్రా రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించటం జరిగింది.