– బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరి హస్పటల్ అధినేత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ శుక్రవారం పాఠశాల విద్యార్థులకు టై , బెల్టు, షూస్ ఐడెంటి కార్డు లు అందజేశారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత గ్రామం కావడంతో విద్యార్థులకు తన వంతు సహకారంగా డ్రెస్ మెటీరియల్స్, ఇతర సామాగ్రి అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, తాజా మాజీ సర్పంచ్ తంగిలపల్లి కల్పనా శ్రీనివాసచారి, తాజా మాజీ ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.