
నవతెలంగాణ – డిచ్ పల్లి
పాఠశాలలో గత 6 అరేళ్ళుగా ప్రిన్సిపాల్ & జిల్లా కొ- ఆర్డినేటర్ గా అత్యున్నత సేవలు అందించారని, ఇదే కాకుండా గత 14 ఏళ్ళుగా ఉపాధ్యాయురాలిగా ఉత్తమ సేవలoదించిన అధ్యాపకురాలు విక్టోరియా లకు సోమవారం డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ గ్రామంలోని టీజీ ఎస్ డ్లు అర్ ఎస్ ఐ సిఈఓ లలో విడ్కోలు సమావేశం నిర్వహించారు.అనంతరం పులమలలు, శాలువాలతో, సత్కరించారు.ఈ సందర్భంగా టీజీ పిఎం జిల్లా అధ్యక్షులు నక్క రాజేందర్మ, పలువురు మాట్లాడుతూ.. పిల్లల జీవితాలలో చదువుల వెలుగులు చిగురింపజేసిన ఈ చదువుల గురువులు బదిలీ పై వెళుతున్న సందర్బంగా తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరపున వీడ్కోలు తెలుపు తున్నాట్లు పేర్కొన్నారు . ప్రతి ఏటా పరీక్షల్లో గురుకులంలో ఉన్న విద్యార్థులు ఉత్తీర్ణత పై ప్రత్యేక దృష్టి సారించారని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసినట్లు వివరించారు.ప్రతి ఉద్యోగులకు బదిలీలు సహజమని ఇక్కడ విద్యార్థులకు ఉత్తములుగా తిర్చి దిద్ది నట్లు బదిలీ అయ్యే చోట కూడా కృషి చేస్తారని అశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో టీజీ పిఎ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎర్ర గంగ నర్సయ్య, మొట్టల దీపక్, బుస బాలరాజ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.