రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. అలాగే ఈ డెడ్లీ కాంబినేషన్లో సెకెండ్ మూవీ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే చార్ట్బస్టర్గా మారింది. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ మరో మాస్-ఆపీలింగ్ చార్ట్బస్టర్ ఆల్బమ్ను స్కోర్ చేశారు. ‘ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్..’కి థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం సినిమాలోని సెకెండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత..’ విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పెక్యూలర్గా ఉన్నాయి. హైదరాబాద్ యాసలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇది దేశీ పార్టీ నెంబర్కి వైబ్ని యాడ్ చేస్తోంది. మణి శర్మ కంపోజిషన్ వెరీ నేటివ్ ఫోక్తో ఆకట్టుకుంది. బీట్స్ చాలా హైగా ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తన శర్మ త్రయం ఈ పాటకు వోకల్స్ అందించారు. వారి వోకల్స్ పాటలోని ఎనర్జీకి పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆయన డ్యాన్స్ కన్నుల పండువగా ఉంది. హుక్ స్టెప్ ఇన్స్టంట్గా పాపులర్ అయ్యింది. రామ్తో పాటు కాలు కదిపిన కావ్య థాపర్ ఈ పాటలో పెర్ఫెక్ట్ గ్లామర్ని యాడ్ చేశారు, లైవ్లీ సెట్స్లో షూట్ చేశారు. దేశీ పార్టీస్ టైంలో ఈ పాట ప్రతి ఒక్కరికీ ప్రైమ్ ఛాయిస్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజరు దత్ పవర్ ఫుల్ పాత్రని పోషించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 15న గ్రాండ్గా విడుదల కానుంది.