సమగ్ర బీటెక్‌ ఓరియంటేషన్‌తో కేహెచ్‌ డీమ్డ్‌ టూబీ యూనివర్శిటీ ప్రారంభం

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,నవతెలంగాణ-శేరిలింగపల్లి
హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌లలో తమ కొత్త బ్యాచ్‌ విద్యార్థుల కోసం విస్తృతమైన బీటెక్‌ ఓరియం టేషన్‌ ప్రోగ్రామ్‌తో 2024-2025 విద్యా సంవత్సరాన్ని కెేల్‌ హెచ్‌ డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ సగర్వంగా ప్రారం భించింది. విద్యార్ధులు వారితల్లిదం డ్రుల కోసం విద్యా సంవత్సరంలో తమ ప్రయాణం ప్రారంభించటానికి అతి ముఖ్యమైన అడుగుగా నిలిచింది.కార్యక్రమం కెఎ ల్‌హెచ్‌ అజీజ్‌ నగర్‌, కెఎల్‌ హెచ్‌ బాచుపల్లి. ఓరియం టేషన్‌ సమయంలో విద్యార్థులు పాఠ్యాంశాల విధానం, కోర్సు వి వరాలు విద్యాపరమైన అంచనాల గురించి సమగ్ర విష యాలను తెలుసుకున్నారు. ప్రోగ్రామ్‌లో ఇంటరాక్టివ్‌ సెషన్‌లు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు ఫ్యాకల్టీ సభ్యుల తో సమావేశమయ్యారు. క్యాంపస్‌ సౌకర్యాలను అన్వేషిం చారు. వివిధ క్లబ్‌లు, కార్యకలాపాల గురించి తెలుసుకు న్నారు. విశ్వవిద్యాలయ విధానాల పట్ల అవగాహన పెం చుకున్నారు. విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి తమ కెరీర్‌లను వృద్ధి చేసుకోవడానికి అవస రమైన అన్ని సాధనాలు, కనెక్షన్‌లను కలిగి ఉండేలా ఈ సమగ్ర పరిచయ కార్యక్రమం రూపొందించబడింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎ రామకృష్ణ, డాక్టర్‌ ఎల్‌ కోటేశ్వరరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె సుబ్బారావు సహా యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు. సిమెన్స్‌ ఈడిఏ ఇండియాలో సీనియర్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌ ప్ర గతి ఠాకూర్‌, హైదరాబాద్‌లోని జెపి మోర్గాన్‌ చేజ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మురళ సాయి సందీప్‌ ప్రత్యేక అతిథులుగా హాజరై, హాజరైన వారికి విలువైన సలహాలు స్ఫూర్తిని అం దించారు. కెఎల్‌హెచ్‌డీమ్డ్‌టుబి యూనివర్సిటీ హైద రా బాద్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూ టర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ సైబర్‌సెక్యూరిటీలలో అధునాతన కోర్సుల తో భవిష్యత్‌ సవాళ్లు అవకాశాల కోసం తన విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కట్టుబడి ఉంది. బయోటెక్నాలజీ ఫార్మసీ కంప్యూటర్‌ సైన్స్‌ ఏఐ అండ్‌ డీఎస్‌, సీఎస్‌ అం డ్‌ ఐటి వంటి రంగాలలో దీని సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ లెర్నింగ్‌ అనుభవాన్ని మరింత విస్తరింపజేసి, విద్యార్థు లను విశేషమైన విజయాలు సాధించేలా చేస్తుందన్నారు. వారిని తీర్చిదిద్దటం కోసం అనువైన వాతావరణాన్ని సృ ష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.