పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ 

Farmer loan waiver in festive atmosphere– 31 వేల కోట్ల మాఫీతో కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది 
– రైతులు అప్పుల పాలు కావద్దన్నది ప్రభుత్వ ఉద్దేశం 
– సమస్యలు ఉంటే కలెక్టర్ కు చెప్పండి 
– జిల్లాలో రూ.60 కోట్లతో పాఠశాలలకు మరమ్మతులు 
– 26 నెలల్లో ప్రాజెక్టులు పూర్తికి సీఎం నిర్ణయం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ లో రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ పథకం దేశంలోనే ఎక్క డ కనివిని ఎరగని రీతిలో పండుగ వాతావరణం లో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒకేసారి సుమారు రూ.  31,000 కోట్ల రూపాయల రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. రైతులు అప్పులపాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ మని, పేదవాడికి, ఆపదలో ఉన్న వాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీ లో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారo రూ. 481.63 కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు రుణా లున్న రైతుల రుణమాఫీ కార్యక్ర మం కింద మొదటి విడతన లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డారు. రాబోయే కాలంలో మరిన్ని  ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాలలో డబ్బులు పడకు న్నా, పాత బాకీ కి ఎవరైనా జమ చేసుకున్న నేరుగా నాకు గాని, జిల్లా కలెక్టర్ గాని ఫోన్ చేయండని సూచించారు.వారం రోజుల్లో లక్ష న్నరలోపు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ అవుతాయని, ఆ తర్వాత వారంలో రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయని వెల్లడించారు. ఆగస్టు చివరినాటికి 2 లక్షల లోపు రుణా లున్న రైతులందరి రుణాలు మాఫీ చేయబడతాయని చెప్పారు. నల్గొం డ జిల్లాలో 60 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో గదుల నిర్మాణం, మౌలి క వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.  జిల్లాలో ప్రభుత్వ పాఠ శాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పా టు చేసి పిల్లలకు విద్య అందించే ఆలోచనలో ఉన్నామని, జిల్లాలో చేపట్టిన ఎస్ఎల్ బి సి సొరంగం, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టుల పూర్తికి గ్రీన్ ఛానల్ లో నిధులను పెట్టించి 26 నెలల్లో పనులు పూర్తి అయ్యేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ముఖ్యమం త్రి కి ధన్యవాదాలు..
నల్గొండ జిల్లాలో పండగ వాతావరణం నెలకొందని వెంకటరెడ్డి అన్నారు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని,  స్వయంగా 5 కిలోమీటర్లు ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు వస్తుంటే వేలాది మంది అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు పరుగులు తీస్తూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిజం చేసి నందుకు ధన్యవాదాలు తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు అనేకమంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతుల గుండెల్లో నిలిచిపోయారని సిఎం ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.నల్గొండ నియోజకవర్గం లో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని, ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయించిందని, నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా  78,757 కుటుంబాలు రుణమాఫీ పొందారని, ఇందుకోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన   దాదాపు 11 కోట్ల కుటుంబాలకి 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ.6,098 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మీ సహకారంతో ఎస్ ఎల్ బి సి, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ లో పెట్టి ముందుకు తీసుకుపోయేం దుకు సహకరించిన మీకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.
అదే విధంగా నల్లగొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహకారంతో  జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పంట రుణాల మాఫీలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ గురువారమే వారి బ్యాంకు ఖాతాలలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ విషయమై గురువారం ఉదయమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని, లక్ష వరకు రుణమాఫీ ఖాతాలలో జమ చేయాలని ఎట్టి పరిస్థితులలో రైతు రుణమాఫీ నిధులను ఇతర లోన్లకు పట్టుకోవద్దని స్పష్టం చేశామని, నేరుగా రైతుల ఖాతాలోని వేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరినట్లు తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్య వల్ల రైతుల ఖాతాలలో నిధులు జమ కానట్లయితే జిల్లా స్థాయిలో ఐదు మంది అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని ,ఆ సెల్ లో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ నెంబర్ 7288800023 నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం నుండి వారం రోజులపాటు రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని బ్యాంకర్లతో కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మున్సిపల్ చైర్మన్  బుర్రి శ్రీనివాసరెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య,  పాశంరామ్ రెడ్డి,  వ్యవసాయ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తలపాకతో ప్రత్యేకంగా..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేస్తున్న సందర్భంగా రుణమాఫీ సంబరాల్లో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొనేందుకుగాను ఆయన నల్గొండ క్లాక్ చౌరస్తా నుండి  ట్రాక్టర్ పై బయలుదేరారు.భారీ ఎత్తున ట్రాక్టర్ బైక్ ర్యాలీలో  భాగస్వామి అయిన మంత్రి డాక్టర్ తలపాగాతో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.