సాగుకు స్వర్ణయుగం…లక్షకోట్ల సంక్షేమం

– బీఆర్‌ఎస్‌ పాలనపై హరీశ్‌రావు ట్వీట్‌
నవతెంలగాణబ్యూరో-హైదరాబాద్‌

నాటి బీఆర్‌ఎస్‌ పాలన సాగుకు స్వర్ణయుగం…లక్షకోట్ల సంక్షేమమంటూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ‘తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 69 లక్షల రైతులకు రైతు బంధు రూ. 72,972 కోట్లు. లక్షా 11 వేల మందికి రైతు బీమా రూ. 6,488 కోట్లు. రైెతురుణమాఫీ కోసం రెండు దఫాల్లో రూ. 29,144.61 కోట్లు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రూ.11.401 కోట్లు. కేవలం ఈ పథకాల ద్వారానే రైతుకు అందిన ఆర్థిక సాయం రూ. 1,20,005 కోట్లు. దేశ చరిత్రలో ఇది ఆల్‌ టైం రికార్డ్‌’ అని పేర్కొన్నారు.