భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటాలి : బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్

– అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలి
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్ 
భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో అంగన్ వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ హై స్కూల్, గ్రామపంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇబ్రహీంపేట్ లో ఉన్న నర్సరీ లో ఉన్న మొక్కలను ఆయన పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సకాలంలో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు వాతావరణ మార్పుల సందర్భంగా విష జ్వరాలు ధైర్య లాంటి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పోస్టుకాహారం అందించాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది కృషి చేయాలన్నారు. మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు సిబ్బంది సమయపాలన పాటించి గ్రామాల్లో సేవలందించాలన్నారు సమయపాలన పాటించని సిబ్బంది అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
       మండలంలోని కొత్త బాది గ్రామంలో ఉన్న  ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఆర్డిఓ మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  పచ్చదనం పెంచేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. పాఠశాలలో నాటిన మొక్కలను ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పకుండా వాటిని సంరక్షించ బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. పాఠశాల టీచర్లు సమయపాలన పాటించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయా లత, పాఠశాల ఉపాధ్యాయినీలు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.