పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రారంభం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేయడం జరిగింది ఎం ఏ./ ఎం.కాం ./ ఎం ఎస్ డబ్ల్యూ./ ఎమ్మెల్సీ./ ఎల్.ఎల్.బి./ ఎల్ ఎల్ ఎం./ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోడ్స్ ( ఏపీ ఈ./ ఐపిసిహెచ్./ ఐ ఎం బి ఏ./ఒకటవ,మూడవ,నాలుగవ, ఏడవ, మరియు తొమ్మిదవ సెమిస్టర్  బ్యాక్ లాగ్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.తెలంగాణ వర్సిటీ మెయిన్ క్యాంపస్,తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్నూర్, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్,ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కె  గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ లో జరిగిన పరీక్షకు ఉదయం 206 మంది విద్యార్థులకు 186 మంది విద్యార్థులు హాజరయ్యారు 20 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం తెలంగాణ వర్సిటీలో మెయిన్ క్యాంపస్ లో జరిగిన పరీక్షల్లో 05 మంది విద్యార్థులకు గాను  05 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా  చంద్రశేఖర్ తెలియజేశారు.