యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ వెంకటేశ్వర్లు

నవతెలంగాణ కొనరావుపేట
గంజాయికి  అలవాటు పడ్డ ఇద్దరు యువకులపై కేసు నమోదు, అరెస్టు చేసి కోర్టులో హాజరు*యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని  చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.చందుర్తి మండలం మూడపల్లి పరిసర ప్రాంతాల్లో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఓ యువకుడు అలాగే చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మరో యువకుడు ఇద్దరు కలిసి  గంజాయి తాగుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి ఇరువురి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు  వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయని , యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని  కోరారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కు పాదం మోపడం జరుగుతుందన్నారు..