యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని చండూరు సిఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం స్థానిక డాన్ బోస్కో కళాశాలలో ఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయని , యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. మతు పదార్దాలకు దూరంగా ఉండాలని విద్యార్దులు తమ లక్ష్యం వైపు దృష్టిని సారించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలశౌరి రెడ్డి , అధ్యాపకులు విద్యార్దినివిద్యార్ధులు పాల్గొన్నారు.