– ఎమ్మెల్యే గాంధీ హామీ
– ఎమ్మెల్యే గాంధీని కలిసిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు
– జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇండ్ల నిర్మాణం కోసం వినతి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇండ్ల నిర్మాణానికి పూర్తి సహకారముంటుందని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఆదివారం శేరి లింగంపల్లి మండల జర్నలిస్టులు కలిశారు. శేరి లింగంపల్లి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా స్థా యి జర్నలిస్టు నాయకులతో కలిసి జర్నలిస్టులు త మ ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సహకారంతో గ తంలో చందానగర్లోని సర్వేనెంబర్ 174లో కే టాయించిన 1 ఎకరం స్థలంలో జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర నాయకులు ఫైళ్ల విటల్ రెడ్డి, జిల్లా అధ్యక్షు డు ఉప్పరి శేఖర్సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు గంటల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్ప రి రమేష్ సాగర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో సమా వేశమై ఇండ్ల నిర్మాణంపై చర్చించారు. జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ..దశాబ్దాలుగా శేరి లిం గంపల్లిలో జర్నలిస్టులుగా పనిచేస్తూ సొంత ఇం డ్ల్లు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కోసం ఎమ్మెల్యే గాంధీ సహకారంతో 2023లో 1 ఎకరం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. చందానగర్లోని సర్వే నెంబర్ 174లో గల 1 ఎక రం భూమిని శేరిలింగంపల్లి జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం నాటి రంగారెడ్డి కలెక్టర్ హరీష్ ప్రొసీడింగ్ నెంబర్ ఎల్సీ 1/25 33/2023ని 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన జారీ చేశారని, స్థానిక రెవెన్యూ అధికా రులు సైతం సర్వే, పంచనామా నిర్వహించి స్థలా న్ని అప్పగించారని తెలిపారు. తమకు కేటాయిం చిన భూమిలో ఎమ్మెల్యే గాంధీ పూజా కార్యక్ర మా లు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. జర్న లిస్టుల ఇండ్ల కోసం కేటాయించిన భూమిలో ఇం డ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని, భూ మి కేటాయింపులో ముందుండి మంజూరు చే యించిన ఎమ్మెల్యే ఇండ్ల నిర్మాణంలో సైతం సహ కరించాలని కోరారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ..జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చ ేసేందుకు చందానగర్ కేటాయించిన భూమిలో ఇండ్ల నిర్మాణం కోసం తనవంతు సహకారం అం దిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారి లో శేరిలింగంపల్లి టెంజు మాజీ అధ్యక్షుడు రవీం దర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగ న్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు పి.అమృత్ గౌడ్, ఉపా ధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, కోశాధికారి లక్ష్మీనారాయణ, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమార్, ప్రెస్ క్లబ్, టెంజు నాయకులు, జర్నలిస్టులు జాయింట్ సెక్రె టరీ ఎల్లేష్, ఖదీర్, షకీల్, కె. రాజు, రాజేష్ గౌడ్, అనిల్ కుమార్ ముదిరాజ్, క్రిష్ణా సాగర్, శివ ము దిరాజ్, ప్రశాంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి, యాదయ్య, ప్రభాకర్ రెడ్డి, దేవేందర్, సురేష్, రాజు, ఆనంద్ గౌడ్, సత్యం, రామకృష్ణ, మల్లేష్, శ్రీనివాస్, రాజే ష్, రాకేష్, భాస్కర్, అశోక్, కర్రబాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.