ప్రస్తుతం ఫీల్ గుడ్ స్టోరీస్, చిన్న చిత్రాలు, కొత్త వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలోనే న్యూ కంటెంట్తో రిఫ్రెషింగ్ ఫీల్తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తు న్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్లో మంచి రెస్పాన్స్ను దక్కించు కున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. ‘గు గు గ్గు..’అంటూ సాగే హుషారైన పాటను కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాిత్యం ్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలోని ‘గు గు గ్గు…’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చాలా బాగుంది. హుక్ స్టెప్స్ బాగున్నాయి. విఘ్నేశ్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే సినిమా ఇది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కంటెంట్ ఉన్న చిత్రమిది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఈదర ప్రసాద్, డాన్స్:కళాధర్, మోహనకష్ణ, రజిని, ఎడిటర్ :కొడగంటి వీక్షిత వేణు.