సుదర్శన్ పరుచూరి హీరోగా ‘మిస్టర్ సెలెబ్రిటీ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘గజానన’ పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయకుడి నామ స్మరణే వినిపిస్తోంది. వినాయక చవితి స్పెషల్గా ఈ సినిమా నుంచి ఈ హుషారైన దైవ భక్తి పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోమోగేలా కనిపిస్తోంది. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరిన ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సాంగ్ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండటం ఖాయం. ఈ చిత్రాన్ని ఎన్.పాండు రంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించనున్నారు.