గుణశేఖర్కు డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్ర గ్లింప్స్ను నిర్మాత దిల్ రాజు, కేఎల్ దామోదర ప్రసాద్ సోమవారం రిలీజ్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ, ‘గుణ శేఖర్ మొదటి చిత్రం ‘లాఠీ’. అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆయన ఎన్నో సక్సెస్లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. ఈ గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి ప్రతీకగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘గుణ శేఖర్ వెర్సటైల్ దర్శకుడు. గ్లింప్స్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది’ అని కే ఎల్ దామోదర్ ప్రసాద్ చెప్పారు.
గుణశేఖర్ మాట్లాడుతూ, ‘అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్ చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్కు యూత్తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లైనా సినిమాటిక్గా కాకుండా అందరూ రియలిస్టిక్గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. ఇప్పుడు కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.