కామారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ల ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట ప్రజలకు సైబర్ నేరాలపైన అవగాహన, 100 డయల్ ఉపయోగం, రోడ్డు భద్రతా నియమాలు, అటవీ సమస్యలు, డ్రగ్స్ తీసుకోవడం పైన అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.