విలేజ్ డ్రామాగా రాబోతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పిఎల్వి క్రియేషన్స్పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్లు అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సినిమాలోని ప్రధాన పాత్రలను చూపించారు. ఇందులో సాయికుమార్ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన వేషధారణ, ఆహార్యం, నటన ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. పాటలు, పోస్టర్లు ఇలా అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మున్ముందు మరింత మంచి కంటెంట్తో ఆడియెన్స్లో హైప్ పెంచేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.