ఉపాధిలో పూడికతీతకు స్వస్తి

– కూలీలు ఉపాధికి దూరమైయ్యేనా.
– కొత్తగా 21 పనులకే పథకం పరిమితం.
– గ్రామాల్లో పనులు గుర్తిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు
నవతెలంగాణ మల్హర్ రావు
 ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రామాల్లో పేదలకు దండిగా ఉపాధి లభించే చెరువుల్లో పూడిక తీత పనులకు స్వస్తి పలికింది. ఇక మీదట చెరువులు, కెనాల్స్ లో ఎలాంటి పనులు చేపట్టవద్దని గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. దీంతో కూలీలు ఉపా ధికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆరు కేటగిరీల్లో కొత్తగా 21 రకాల పనులతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పనుల్లో కూలీలకు పని చేసేందుకు ఎంత వరకు అవకాశం లభిస్తుందో తెలియదు. ఇటు ఈ నెలాఖరు నాటికి పనులు గుర్తించి వాటి అంచ నాలను సిద్ధం చేసి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తించే పని లో నిమగ్నం అయ్యారు. గుర్తించిన పనులను 2025 మార్చిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు కూడా విధించింది.
మహిళా శక్తికి భరోసా..
మహిళా సంఘాల సభ్యులందరికీ ఉపాధి భరోసా కల్పించేలా ఉపాధిహామీలో భాగస్వాములను చేసింది ప్రభుత్వం. వీరిని స్వయం ఉపాధి వైపు మళ్లించేలా రుణాలిచ్చి ఆవులు, మేకలు, చేపల పెంపకం చేపట్టేలా చేస్తారు. పశువుల షెడ్లు, వర్మి కంపెస్టు, ఆజోల మొక్కల పెంపకం, బీడు భూముల ఆ భివృద్ధి చేయనున్నారు. పశువుల షెడ్లు, వర్మి కంపో స్టు షెడ్లు మండలానికి పది చొప్పున, అలాగే పౌల్జి షెడ్లు మండలానికి ఒకటి చొప్పున నిర్మించనున్నారు.
పొలం బాటలు..
పల్లెల్లో పంట ఉత్పత్తులు ఇంటికి చేర్చడానికి మట్టిదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో 20 కిలో మీటర్లు మట్టిరోడ్లు వేసుకోవచ్చు. గతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే మట్టి రోడ్ల సం ఖ్యను కేంద్ర తగ్గించింది.
మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం:
గ్రామాల్లో ఇంటింటి వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కనీసం మండలానికి పది చొప్పున నిర్మించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలాగే పాఠశాలల్లో మండలానికి ఒకచోట టాయిలె ట్ల నిర్మాణం, మండలానికి కిలోమీటరు చొప్పున సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది సీసీ రోడ్ల నిర్మాణాలను కేంద్రం తగ్గించింది. అలాగే అంగన్వాడీ భవనాలు మండలానికి ఒకటి చొప్పున, గ్రామ పంచాయతీ భవనాలను మం డలానికి రెండు చొప్పున నిర్మించనున్నారు.
జలనిధి…
జలసంరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయడం.ఇంటింటా ఇంకుడు గుంతలు పారం పాండ్లు,ఇంటి పైకప్పు భాగంలో కురిసిన నీటిని భూగర్భoలోకి ఇంకించేలా (రూప్ ట్యాప్ హార్వెస్టింగ్ స్ట్రక్షర్) చేతిపంపుల వద్ద ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వడం,చెక్ డ్యామ్ లు కట్టేలా చర్యలు తీసుకోనున్నారు.చెక్ డ్యామ్ లు మండలానికి ఒకటి,పారం పాండ్లు మండలానికి ఐదు కట్టనున్నారు.
పండ్ల తోటలు..
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల ద్వారా రైతులను ప్రోత్సహించడం, వారికి రాయితీపై బిందు సేద్యం పరికరాలు ఇచ్చేలా చేస్తారు. మండలంలో 50 వేలఈత, తాటి వనా లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటలను మండలానికి ఐదెకరాల్లో పెంచేలా. లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నర్సరీలను సిద్ధం చేయనున్నారు.
గడువులోగా పనులు పూర్తి చేస్తాం : ఎపిఓ హరీష్
ఉపాధిహామీ పథకం ఉపాధి హామీలో ఇచ్చిన పనులు ఈ నెలాఖరు నాటికి గుర్తిస్తాం. ప్రభుత్వం విధించిన గడువులోగా పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తాం. కూలీలకు ఉపాధి లభించేలా పనులు కల్పిస్తాం.
మండలంలో ఉపాధిహామీ వివరాలు:
15 గ్రామపంచాయతీలు
8441 జాబ్ కార్డులు
18,752 కూలీలు.
వంద రోజులు పూర్తి చేసిన కూలీలు…35