బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం – 2012 మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006. మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ చల్వాయి, నందు మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, ములుగు. ఆధ్వర్యంలో గురువారం బాలల హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రరెడ్డి మాట్లాడుతూ.. బాలలు విద్యార్థి దశలో మంచి అలవాట్లు, మంచి గుణాలు అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగలరు అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, నుండి సోషల్ వర్కర్, జ్యోతి. పాక్సో చట్టం 2012, మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ఈ చట్టాఎల్లపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, నుండి గెలుపు చెందడానికి వారిలో మంచి అలవాట్లు నేర్చుకునే పద్ధతుల గురించి వివరించడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నాగమణి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చేయగలరు అని వివరించడం జరిగింది. స్రవంతి మాట్లాడుతూ తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లాలోని బాలల బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సఖి కేంద్రం నుండి సాధన మాట్లాడుతూ సఖి కేంద్రంలో ఐదు రకాల సేవలు ఉంటాయని ఆ సేవల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గోన్నారు.