అరుదైన కోర్ట్‌ రూమ్‌ డ్రామా

A rare courtroom dramaవీర్‌ రెడ్డి, దయానంద్‌ రెడ్డి, ఢిల్లీ గణేశన్‌, గిరిధర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్‌’. రవి గోగుల దర్శకత్వంలో సిల్వర్‌ కాస్ట్‌ బ్యానర్‌ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ఫ్రీరిలీజ్‌ వేడుకను ప్రసాద్‌ల్యాబ్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వీర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘నాకు ఎటువంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. కరోనా టైమ్‌లో పాడ్‌ కాస్ట్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లీగల్‌ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయడం సులభంగా అనిపించింది. ఇంత వరకు మన దగ్గర లీగల్‌ థ్రిల్లర్‌ సినిమాలు అంతగా రాలేదు. రియల్‌ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాం’ అని తెలిపారు.
‘వీర్‌ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపించింది. ఇదొక అరుదైన సబ్జెక్ట్‌. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని దర్శకుడు రవి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్‌ విశ్వనాథ్‌ చౌదరి మాట్లాడుతూ,’టీజర్‌కు మంచి బజ్‌ వచ్చింది. ఈ సినిమాను మేం 70 థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.
ప్రొడ్యూసర్‌ శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ, ‘ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం. లా సబ్జెక్ట్‌పై అరుదైన సినిమా తీసుకు వస్తున్నాం. ఈ నెల 27న విడుదలయ్యే మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు – స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి గోగుల, సంగీతం: శంకర్‌ తమిరి, సినిమాటోగ్రాఫర్‌: జాక్సన్‌ జాన్సన్‌, అనూష్‌ గోరక్‌, ఎడిటర్‌: ఉద్ధవ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శివ చైతన్య.