సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శిని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ను గురువారం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు చాలా పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల, వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికి మంచి గుర్తింపు తీసుకురావాలి’ అని అన్నారు. గీతిక మాట్లాడుతూ, ‘ఈ సినిమా చాలా మంచి చిత్రం. తప్పకుండా అందరికి తమ మరపురాని రోజులను గుర్తుకు తెస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో దూరదర్శిని వాణి, హరిల ప్రేమను ఎలా కలిపింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని గీతిక రతన్ చెప్పారు. సువిక్షిత్ మాట్లాడుతూ, ‘అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్డ్రాప్కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతో డిటైల్డ్గా దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో ఉన్న ఎమోషనే మాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది నా కథ అనుకుంటారు’ అని అన్నారు.
మీ ప్రేమకథల్ని గుర్తు చేసే సినిమా
10:08 pm