
నవతెలంగాణ – కామారెడ్డి
సైబర్ జాగృత దివాస్ సంధర్బంగా బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమనీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజన్ జూనియర్ కళాశాలలో నిర్వహించరు. ఈ కార్యక్రమంలో 1.డిజిటల్ అరెస్ట్ 2. ఏపీకే ఫైళ్లు 3. బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్ 4.ఇన్వెస్ట్మెంట్స్ (స్టాక్) మోసాలు 5. డైల్ 1930 ప్రాముఖ్యత 6. గోల్డెన్ అవర్ ప్రాముక్యత గురించి అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమం లో సైబర్ కానిస్టేబుల్ ప్రవీణ్, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ రోజ కళాశాల విద్యార్థిని, విధ్యార్థులు పాల్గొన్నారు.