నవతెలంగాణ కంఠేశ్వర్ : తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలరించారు.ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరుకున్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు.