నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు, 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్

నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తనిఖీలు చేస్తామని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా సిబ్బంది నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను, 10 అనధికార సైలెన్సర్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్ సైకిల్ లను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం నెంబర్ ప్లేట్, సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ పైన జరిమానా విధించి కొత్త నెంబర్ ప్లేట్స్, కంపెనీ సైలెన్సర్, వేయించిన తరువాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన రైడర్స్ కి అవగాహన కల్పించి నెంబర్ ప్లేట్స్ లేకుండా శబ్ద కాలుష్యం చేస్తూ వాహనములు నడిపించవద్దని అవగాహన కల్పించారు. నిబంధనలను తప్పక పాటించాలన్నారు పాటించని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.