నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామసభల ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల అర్హుల జాబితాలపై బుధవారం మండలంలోని ఆన్ సాన్ పల్లి,ఎడ్లపల్లి, కొండంపేట,కొయ్యుర్, మల్లంపల్లి దుబ్బపేట,చిన్నతూoడ్ల,అడ్వాలపల్లి గ్రామాల్లో సభలను ఎంపిడిఓ శ్యాంసుందర్,తహశీల్దార్ రవికుమార్ తోపాటు పలువురు అధికారులు ప్రారబించారు.రేందవ రోజు గ్రామసభలు ప్రశాంతంగా నిర్వహించారు. పథకాల అర్హుల జాబితాలను గ్రామసభల్లో ఒక్కోటిగా చదివి వినిపించారు. అందులో ఎలాంటి అభ్యంత రాలు వచ్చినా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.నాలుగు పథకాలకు సంబంధించి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే తిరిగి మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చినా గ్రామసభల్లో తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకం అర్హుల జాబితాను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదిం చినట్లు ప్రకటిస్తామన్నారు.