ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ఆదిలాబాద్ వాసి ఎన్నిక..

Adilabad resident elected to ICAI Hyderabad Branch Managing Committee..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ఆదిలాబాద్ నుంచి సీఏ శైలేష్ ఖండేల్వాల్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్‌కు గర్వకారణంగా, సీఏ శైలేష్ ఖండేల్‌వాల్ 2025-2029 కాలానికి ఐసీఏఐ  దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్ఐఆర్సీ) హైదరాబాద్ బ్రాంచ్‌కు మేనేజింగ్ కమిటీ సభ్యునిగా పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నిక కావడం విశేషమైంది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ బ్రాంచ్‌ మేనేజింగ్‌ కమిటీకి ఎన్నిక కావడం పట్ల పట్టణ ప్రజలు గర్విస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వృత్తి అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీఏఐ శాఖలో ఈ బాధ్యతను స్వీకరించిన ఆయన విజయం ఆదిలాబాద్‌కు కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, ఇది గర్వకారణమన్నారు. కాగా పలువురు ఆయనను అభినందించారు.