నిజామాబాద్ ప్రజలు నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలని శనివారం నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధు శర్మ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహలను ప్రతిష్టించరాదు, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.ఎక్కువ శబ్దంతో డి.జే లను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యం తో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జేల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి.జేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో నిషేదం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమీషనర్ అనుమతి తప్పనిసరి. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమీషనర్ అనుమతి తీసుకోవాలి. మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్ ఎగ్జిబిషన్, బిజనెస్ ప్రదేశాల వద్ద ప్రజలకోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి.
ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలి. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకో-వడం జరుగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎవరయినా ప్రజా ప్రయో జనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు మరియు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనాధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి తెలియజేయండి. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిజామాబాద్ జిల్లాలో ఎ (పెద్దలు) సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి ధియేటర్లను అనుమతించరాదు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు పిల్లల పట్ల అసభ్యకరమైన, వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినయోగదారులకు ముఖ్యంగా మహిళలు పిల్లలకు చికాకు ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశా లు జారీచేయడం జరిగింది. నిబంధనలను ఎవ్వరయిన అతిక్రమించిన యెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడానికి,నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓలకు /ఎస్.ఐ,లకు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్. అధికార ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రజలందరూ సంబంధిత పోలీస్ అధికారులకు సహకరించాలని ఇన్చార్జి సిపి తెలిపారు.