ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి..

నవతెలంగాణ-వీణవంక
ప్రతీ ఒక్కరూ ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఈవో రాకేష్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచార రథం ద్వారా మండలంలోని ఇప్పలపల్లితో పాటు పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి సర్పంచ్ ఎనగంటి విజయ-శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సోమేశ్వర్, కానిస్టేబుల్ రవీందర్,  వీఆర్ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.